Today Telugu News Updates

కేదారినాథ్ మంచుకొండల్లో చిక్కుకున్న యుపి, ఉత్తరాఖండ్ సీఎం లు !

CMs trapped in Kedarnath

ప్రముఖ ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం కేదారినాథ్ లో అనుకోకుండా వాతావరణం మారిపోయి మంచుకురవడం మొదలైంది. క్షేత్రం సమీపంలో పలు అతిధి గృహాల శంకుస్థాపన కు వెళ్లిన యుపి, ఉత్తరాఖండ్ సీఎం లు వాతావరణం అనుకూలించకపోవడంతో అక్కడే చిక్కిపోయారు.

ఈ శంకుస్థాపనకి ఆదివారం వెళ్లిన సీఎం లు  తిరుగు ప్రయాణ చేసే సమయంలో హెలికాఫ్టర్ లో వెళ్లే పరిస్థితి లేకపోవరంతో ప్రస్తుతం అక్కడే ఉండిపోయారు.

కేదారినాథ్ ను 2018 లో దర్శించిన యోగి ఆదిత్యనాథ్ అప్పట్లోనే అతిధి గృహాలు కట్టిస్తానని మాట ఇవ్వడంతో ఆ మాటని నెరవేర్చడానికి ఆదివారంరోజు బయలుదేరి శంకుస్థాపనను పూర్తిచేసాడు.

వాతావరణం అనుకూలించాకే మా ప్రయాణం మొదలుపెడతామని యోగి ఆదిత్యనాథ్ ఫోన్ ద్వారా మీడియాకు సమాచారం అందించాడు.

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button