Today Telugu News Updates

TRS కు షాక్, మారో నేత బీజేపీ లో చేరిక

TRS కు షాక్, మారో నేత బీజేపీ లో చేరిన టిఆర్ఎస్ నేత , శాసనమండలి మాజీ చైర్మన్ స్వామిగౌడ్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన బిజెపి జాతీయ అధ్యక్షులు జె.పి.నడ్డా స్వామి గౌడ్ కు పార్టీ కండువా కప్పి పార్టీలో ఆహ్వానించారు . ఈ కార్యక్రమంలో బిజెపి ఎంపి సిఎం రమేష్ , బిజెపి రాష్ట్ర ఎంఎల్‌సి రామచందర్ రావు పాల్గొ న్నారు .

బిజెపిలో చేరడం తిరిగి తన మాతృ సంస్థకు వచ్చినట్లు ఉందని , తన ఇంటికి తిరిగి చేరానని భావిస్తున్నానని స్వామీగౌడ్ ఈ సందర్భంగా అన్నారు . ఎలాంటి పదవులు ఆశించి బిజెపిలో చేరలేదని , తెలంగాణ కోసం ఒక్క నాడు కూడా పోరాడని వారికి టిఆర్ఎస్ లో పదవులు ఇచ్చారని , తెలం గాణ కోసం పోరాడిన వారిని పక్కన పెట్టారని ఆయన విమర్శించారు . తండ్రి లాంటి సిఎం కెసిఆర్ ఈ విషయంలో ఎందుకు అలసత్వం వహించారో అర్థం కాలేదన్నారు . ఉద్యమకారులు కనీస మర్యాదలకు నోచుకోలేరా ? ఉద్య మకారులను ఎండన నిలబెట్టి పోరాడని వారికి మాత్రం గొడుగు పట్టారని స్వామీగౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు .

రెండేళ్ల నుంచి కెసిఆర్ అపాయింట్ మెంటే దొరకలేదు ‘ కేసీఆర్ నా నిర్ణయాన్ని గౌరవిస్తారని భావిస్తున్నా . రెండేళ్ల నుంచి సిఎం కెసి ఆర్‌ను కలిసేందుకు ప్రయత్నించాను . నాకు ఇంతవరకు అపాయింట్ మెంట్ దొరకలేదు . ఆత్మగౌరవం కోసమే టిఆర్ఎస్ లో వీడి బిజెపిలో చేరాను . తెలం గాణ ఉద్యమకారుల ఆత్మగౌరవం కోసమే ఈ పార్టీ మార్పు . చాలా మంది ఉద్యమకారులకు టిఆర్ఎస్లో ఆత్మగౌరవం లభించడం లేదు . ఐదేళ్లలో ఉన్న పరిపాలన వేరు . ఇప్పుడున్న పాలన వేరు ‘ అని స్వామిగౌడ్ అన్నారు .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button