Today 23rd August updated news in Telugu : ఈరోజు ముఖ్యాంశాలు..!
Today 23rd August updated news in Telugu : 1. ఇండియన్ చెస్ ప్లేయర్ కి ప్రపంచవ్యాప్తంగా ప్రశంసల వర్షం… ఇండియా యంగ్ గ్రాండ్ మాస్టర్ ఆర్ ప్రజ్ఞానంద్ ఫిడే ప్రపంచ కప్ ఫైనల్ లోకి వెళ్లిన సంగతి తెలిసిందే.
2. తెలంగాణలో మరో కొత్త జేఎన్టీయూ కాలేజ్.. ఆదిలాబాద్ లో జేఎన్టీయూ ఇంజనీర్ కాలేజ్ ఓపెన్ చేయబోతున్నట్లు విద్యాశాఖ కార్యదర్శి ఉత్తర్వులు జారీ
3. పాక్ పై సర్జికల్ స్ట్రైక్ చేసినట్లు వస్తున్న వార్తలు అవాస్తవమన్న కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ.. ఇద్దరు ఉగ్రవాదులు భారత్ లోకి చొరబడే ప్రయత్నం చేశారని తెలిపిన కేంద్రం
4. తెలంగాణ గాంధీభవన్ లో దరఖాస్తుల జోరు.. ఇప్పటివరకు రాబోయే అసెంబ్లీ ఎలక్షన్స్ కోసం 5 రోజుల్లోనే 280 దరఖాస్తులు.. ఈనెల 28 వరకు అప్లికేషన్లు స్వీకరణ
5. ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు మంత్రి హరీష్ రావు పై ఘాటు వ్యాఖ్యలు..బిఆర్ఎస్ లో మొదలైన ప్రకంపనలు

6. మరోసారి భారీగా పెరిగిన వెండి ధర.. స్వల్పంగా పెరిగిన బంగారం ధర.
7. హైదరాబాద్లో ఇటీవలే బాలిక పై గ్యాంగ్ రేప్ చేసిన నిందితులను పట్టుకున్న పోలీసులు.. కానీ ప్రధాన నిందితుడు కోసం కొనసాగుతున్న గాలింపు
8. మరోసారి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకపోవడంతో భావోద్వేగానికి గురైన ఎమ్మెల్యే రాజయ్య.. అయినా బిఆర్ఎస్ ని వీడే ప్రసక్తి లేదంటూ ప్రతిజ్ఞ
9. చంద్రయాన్ 3 పై ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ వ్యంగ్య ట్వీట్.. కర్ణాటకలో కేసు నమోదు
10. హైదరాబాద్ లోని త్రిబుల్ ఐటీ సిల్వర్ జూబ్లీ కి చంద్రబాబు కి అందిన ఆహ్వానం