Today Telugu News Updates
ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కి గుడ్ న్యూస్… ఉచిత శిక్షణ ఉద్యోగం ఇవ్వనున్నారు

ఇంజనీరింగ్ పూర్తి చేసినవారికి ఇది మంచి శుభవార్త అని చెప్పాలి. SUNNY OPOTECH INDIA PVT LTD అనే కంపని ఉచిత శిక్షణతో పాటు ఉద్యోగం ఇవ్వనుంది. ఈ మేరకు AP ప్రభుత్వం స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ప్రకటన విడుదల చేసింది.
B.Tech లో ece ,eee ,mech ,eie పూర్తీ చేసిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు అని ప్రకటించింది. ఇందుకుగాను అభ్యర్థులు 60% మార్కులు పొంది ఉన్నవారే ఈ ఉద్యోగాలకు అర్హులని వెల్లడించింది.
అదేవిదంగా 2018, 2019 లో పాసైన వారికీ ఇందులో అవకాశం ఉందని తెలిపింది. ఈ జాబ్ లో జాయిన్ అయినవారికి 14,000 వేయిల వేతనం ఉండనుంది. మొత్తం 60 పోస్టులకు ఈ ప్రకటన విడుదల చేశామని స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ తెలిపింది.