తిరుమలలో శ్రీవారి నిత్య ఉత్సవాలు
ప్రతి రోజు తిరుమల లో స్వామి వారికి ఎలాంటి నిత్య సేవలు జరుగుతాయ్ అన్నది మీకు తెలుసా . . తెలీకపోతే మీకోసమే ఈ కథనం.
ప్రతి రోజు ఆరాధన ఉత్సవాల్లో భాగంగా అంతరాలయములో ఉన్నటువంటి స్వామి ఉత్సవ బేరం అయిన మలయప్ప స్వామిని వైభవోత్సవ మండపానికి తీసుకువచ్చి అక్కడ హోమాగ్ని సాక్షి గా ఉభయ దేవేరులతో స్వామి వారికి కళ్యాణం నిర్వహిస్తారు. అనంతరం మధ్యాహ్నం అద్దాల మండపం బంగారు తిరుచ్చి లో తీసుకువచ్చి వెండి ఉయలకు అనుసంధానం చేసి ఊంజల్ సేవ నిర్వహించి నక్షత్ర హారతి కర్పూర హారతి తో ముగిస్తారు.
అనంతరం సాయం సంధ్యా వేళ స్వామి వారికి ఆర్జిత వసంతోత్సవం, బ్రహ్మోత్సవం నిర్వహించిన అనంతరం స్వామి ని నాలుగు తిరుమాడ వీధుల్లో ఊరేగిస్తారు. అనంతరం స్వామి వారిని సహస్ర దీప అలంకరణ మండపం లోకి వేంపు చేసి వేదం, నాదం, గానం ల మధ్య సహస్ర దీపాలంకరణ అనంతరం విమాన గోపుర ప్రదక్షిణ సహితంగా తిరిగి అనందనిలయం లోకి ప్రవేశించి తర్వాత వెండి భోగ శ్రీనివాస మూర్తికి రాత్రి సమయాన బంగారు ఊయలలో శయనింప జేసి ఆవు పాలు, పప్పులు నివేదన చేసి అన్నమయ్య జోల పాటతో సేవలు ఆ రోజుకు ముగిస్తారు.