ఈరోజు చేయాల్సిన ప్రత్యేక ఆరాధన
ఈరోజు కార్తీక బహుళ సప్తమి కార్తీక మాసంలోని 22వ రోజు , ఈరోజు చేయాల్సిన ఆరాధన విశేషాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
ప్రతీరోజు విశేషాలతో కూడిన కార్తీక మాసంలో ఏరోజు ఏ పుణ్య కార్యం చేసినా కూడా మీకు అద్భుతమైన ఫలితం ఇస్తుంది. ఈరోజు సప్తమి తిధి ఉంది. ఇది భాను సప్తమి గా చెబుతారు. సప్తమి సూర్యునికి ఇష్టమైన తిధి ఆయన ఆవిర్భవించిన తిధి కూడా. ఈరోజు ఆయన అనుగ్రహము కోసం ఈరోజు ప్రత్యేకంగా నమస్కారాలు చేయడం , ఆర్ఘ్యపాద్యాలు ఇవ్వడం, ప్రీతిగా గోధుమ నూక పాయసం నివేదన చేయడం ముఖ్యమైనది. ఆదిత్యుని త్రిమూర్తి స్వరూపం గా కొన్ని స్తుతులు చెబుతున్నాయి. అందరికి ప్రత్యక్షం గా కనబడే నారాయణ స్వరూపం.
అంతే కాకుండా ఈ సప్తమి నాడు జిల్లేడు పూలతో గుచ్చిన దండను ఈశ్వరునికి సమర్పిస్తే సంపదలు వృద్ధి చెందుతాయి.జిల్లేడు మొక్క వేరు భాగాలలో ఆదిత్యుడు, వినాయకుడు, ఆంజనేయ స్వామి నివాసం ఉంటారని చెబుతారు.
ఓమ్ నమః శివాయ