Tollywood news in telugu
‘సర్కారు వారి పాట’ షూటింగ్ ప్రారంభం !

టాలీవుడ్ అందగాడు మహేష్ బాబు కొత్త సినిమా ‘సర్కారు వారి పాట’ షూటింగ్ ప్రారంభమైంది . మైత్రీ మూవీ మేకర్స్, జీఎమ్బీ ఎంటర్టైన్మైంట్, 14 రీల్స్ ప్లస్ సంస్థల నిర్మాణంలో యువ దర్శకుడు పరశురామ్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుంది.
కాశీ విశ్వనాధ స్వామి గుడిలో ఈ చిత్ర షూటింగ్ లాంఛనంగా ప్రారంభం అయింది. మహేష్ కూతురు ఘట్టమనేని సితార ఫస్ట్ క్లాప్ కొట్టగా, నమ్రత మహేష్ కెమెరా స్విచ్ ఆన్ చేసి ప్రారంభించారు .
జనవరి 2021 మొదటి వారం నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది . ఈ సినిమాలో సూపర్స్టార్ మహేశ్బాబు, కీర్తి సురేష్, వెన్నెల కిషోర్, సుబ్బరాజు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. అలాగే సర్కారు వారి పాట కి థమన్ తనదైన శైలిలో సంగీతం సమకూర్చనున్నారు .