Tollywood news in telugu
Revanth Reddy: బండి సంజయ్, అర్వింద్ ఆటలో అరటిపండ్లు అంటూ సంచలన ఆరోపణలు చేసిన రేవంత్ రెడ్డి
తమిళనాడు బీజేపీ ఎన్నికల ఇంచార్జి గా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నియామకంలో సీఎం కేసీఆర్ సహకారం ఉందని కాంగ్రెస్ నేత ఎంపీ రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఈ మేరకు కిషన్ రెడ్డి తమిళనాడు ఇన్చార్జి గా వెళ్ళడానికి సీఎం కేసీఆర్ హస్తం ఉందన్నారు.
బీజేపీ టీఆర్ఎస్ మధ్య రహస్య ఒప్పందం ఉందని.. ఆది ఇప్పుడు బయటపడుతుందని రేవంత్ రెడ్డి విరుచుకుపడ్డారు. సీఎం కేసీఆర్ తెలంగాణ ఇంటెలిజెన్స్ అధికారులను తమిళనాడులో పెట్టారని, ఈ అంశంపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
బండి సంజయ్ కెసిఆర్ ను జైలుకు పంపిస్తా మంటూ ఆరోపణలు చేస్తున్నాడు కానీ.. ఒక్క కేసు కూడా ఎందుకు నమోదు చేయలేదన్ని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. బండి సంజయ్ ,ధర్మపురి అరవింద్ ఆటలో అరటిపండు అన్ని ఎద్దేవా చేశారు.