రకుల్ ప్యాంటు పై రచ్చ
ఈ మధ్యకాలంలో సెలబ్రిటీలు పై ట్రోల్లింగ్ మరి ఎక్కువైపోయింది.అది హీరోయిన్లను అయితే పరిమితులు దాటి మరి కామెంట్లు చేస్తూ వాళ్లను ఓ ఆట ఆడుకుంటున్నారు పోకిరీలు.ఇలాంటి పోకిరీలకు ఈసారి తెలుగు స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ బలైంది.ఇక వివరాల్లోకి వెళితే.
కారులో నుండి రకుల్ దిగుతున్న ఫోటో నొకదాన్ని ఒక వ్యక్తి పోస్ట్ చేసి సెషన్ తర్వాత ప్యాంట్ వేసుకోవడం మర్చిపోయింది అని కామెంట్ చేశాడు.ఈ కామెంట్ పై రకుల్ ప్రీత్ తనదైన శైలిలో ఇలా స్పందించింది ( ఇలాంటి సెషన్స్ కార్ లో మీ అమ్మ కూడా చేసి ఉంటుంది.అందుకే నీకు తెలిసింది. ఈ సెషన్స్ వివరాల కోసం మీ అమ్మని అడుగు) అని కామెంట్ చేసింది.నీ పై చేసిన కామెంట్స్ కి కౌంటర్ గా నువ్వు తిరిగి ఒక మహిళను అవమానించాలా అంటూ? రకుల్ పై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.
తన తప్పేమీ లేకుండా తనపై జరుగుతున్న ట్రోల్లింగ్ పై రకుల్ ప్రీత్ సింగ్ నా నీతి నిజాయితీలను ప్రశ్నిస్తున్న నెటిజన్లు మహిళలను లక్ష్యంగా చేసుకుని అసభ్యంగా కామెంట్లు చేస్తున్నప్పుడు ఎందుకు ప్రశ్నించలేదని ఫైర్ అయ్యింది.
అసలు అటువంటి బట్టలు వేసుకుని పబ్లిక్ లో తిరుగుతున్నందుకు ఆ హీరోయిన్ సిగ్గుపడాలి. పరీక్షగా చూస్తే కానీ ఆ ఫొటోలో ఆవిడ గారి నిక్కర్ కనిపించలేదు. మై ఛాయిస్ అన్నంత మాత్రాన అసభ్యమైన వ్యక్తిస్వతంత్రం అవదు. సమాజం అంటే కాస్తైనా గౌరవం ఉండాలి.
తను చేసిన పనికి ఇప్పుడైనా తెలివి తెచ్చుకుని … ఆ నెటిజెన్ చేసిన కామెంట్ కు (ఆ కామెంటూ అంత బాగుండలేదు లెండి, అతను “కారులో సెషన్” అనే మాటలు వాడకుండా “అరే, నిక్కర్ వేసుకోలేదే” లాంటి మరో రకమైన కామెంటేదన్నా పెడితే సరిపోయేది) స్పందించకుండా ఊరుకుందా, పోనీ నా బట్టలు నా ఇష్టం లాంటి జవాబిచ్చి సరిపెట్టుకుందా అంటే అదీ లేదు. పైపెచ్చు అతని తల్లిని అవమానించడం, ఎదురుపడితే అతన్ని చెంపదెబ్బ కొట్టేదాన్ని అంటూ శివాలెత్తడం …. ఈవిడ గారి సంస్కారం ఏమయింది మరి?
కాస్త డబ్బు, ఫేమ్ రాగానే ఈ సోకాల్డ్ సెలెబ్రిటీలకు పెరిగిపోయే అహంకారానికి మాత్రం తక్కువేమీ లేదు. అసలు జనాలు వాళ్ళని పట్టించుకోకుండా ఉంటే ఉత్తమం. జనాలు పట్టించుకోకపోతే వీళ్ళు ఒడ్డున పడ్డ చేపల్లా విలవిలలాడిపోతారు.