News
నాయిని నర్సింహారెడ్డి ఇకలేరు!

naayini narsimha reddy died :: తెలంగాణ కి తొలి హోమ్ మంత్రిగా పని చేసిన నాయిని నర్సింహారెడ్డి కన్నుమూశారు. అనారోగ్యం తో హైదరాబాద్ లోని అపోలో హాస్పిటల్ లో గత కొన్ని రోజులుగా చికిత్స తీసుకుంటున్న కాసేపటి క్రితం అనగా 22nd అక్టోబర్ ప్రొద్దున ఒంటి గంట ప్రాంతంలో తుది శ్వాస వదిలారు.
ప్రజల మనిషిగా పేరున్న నాయిని నర్సింహ రెడ్డిని ప్రజల మనిషిగా పిలుస్తారు, కార్మికుల పక్ష పాతి గా పేరు గడించారు, ఈయనను బుల్లెట్ నర్సన్న అని పిలుస్తారు. తనకి ఇష్టమైన బుల్లెట్ పైన తిరుగుతూ ప్రజల సమస్యలు తెలుసుకునే వారు, నాయిని మృతికి పలువురు నేతలు సంతాపం ప్రకటించారు.