తల్లిదండ్రులు మందలించారని ఆత్మహత్యచేసుకున్న మైనర్ ప్రేమజంట !
ఈ జనరేషన్ మైనర్లు తెలిసీ తెలీక ప్రేమ దోమ అంటూ చేడు తిరుగుళ్ళుతిరిగి వారి జీవితాలను నాశనం చేసుకుంటున్న సంఘటనలు ఎన్నో జరుగుతున్నాయి. తాజాగా ఇలాంటి సంఘటనే ఒకటి జరిగింది.
వివరాల్లోకి వెళ్తే…. మహబూబ్ నగర్ జిల్లా మిడ్జిల్ మండలం లోని వేముల గ్రామానికి చెందిన ఇంటర్ వరకు చదువుకున్న శ్రీకాంత్ , అదేగ్రామానికి చెందిన తొమ్మిదో తరగతి చదువుతున్న అఖిల అనే బాలికతో ప్రేమలో పడ్డాడు.
ఈ విషయం కాస్త వారి వారి కుటుంబసభ్యులకు తెలవడంతో ఈ చిన్నవయసులో ప్రేమ, పెళ్లి ఏంటి అని గట్టిగ మందలించడంతో మనస్తాపానికి గురిఅయిన ఆ ప్రేమికులు, గ్రామా పొలిమేరలో ఉన్న మామిడి తోటలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు.
ఈ ఘటన తెలుసుకున్న కుటుంబసభ్యులు ఆ తోటకు చేరుకోగా విగతజీవులుగా చెట్టుకు వేలాడుతున్న వారి పిల్లలని చూసి, గుండెలవిసేలా రోదించారు. ఈ ఘటనపై పోలీసులు కేసునమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.