Tollywood news in telugu
సినిమా నిర్మాణం కోసం కసరత్తు చేస్తున్న మహేష్ బాబు !
మహేశ్ బాబు ఓపక్క మల్టీప్లెక్స్ నిర్వహణ మరోపక్క సినిమాలలో నటిస్తూనే సినిమా ని నిర్మించనున్నాడు. ఇప్పటికే ఆయన యంగ్ హీరో అడివి శేష్ హీరోగా ‘మేజర్’ పేరిట ఓ సినిమాని నిర్మిస్తున్నారు.
ఈ చిత్రం శశికిరణ్ తిక్క దర్శకత్వంలో రూపుదిద్దుకుంటుంది. అలాగే షూటింగ్ కూడా చివరి దశకి చేరుకోబోతుంది. ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇదిలా ఉంటే , మరో బడ్జెట్ చిత్రాన్ని కూడా మహేశ్ తన జీఎంబీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నిర్మించడానికి కసరత్తు చేస్తున్నారని తెలుస్తుంది. ఈ చిత్రంలో నవీన్ పోలిశెట్టి నటిస్తున్నాడని టాక్ , ఆమధ్య విడుదలైన ‘ఏజంట్ సాయిశ్రీనివాస ఆత్రేయ’ సినిమా ద్వారా నవీన్ తన నటనా పరంగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.
నవీన్ తో చేయబోయే సినిమా పై ఇంకా చర్చలు మాత్రమే జరుగుతున్నాయి. ఇంకా దర్శకుడు ఎవరన్నది తెలియాల్సిఉంది.