సేదతీరుతున్న కీర్తి ని చుడండి అంటూ … నితిన్ షేర్ చేసిన ఫోటో !

Keerthy Suresh: వెంకీ అట్లూరీ తెరకెక్కిస్తోన్న చిత్రం రంగ్దే, ప్రస్తుతం ఈ సినిమా కి సంబంధించిన షూటింగ్ దుబాయ్లో జరుగుతోంది. దుబాయ్ షెడ్యూల్లో భాగంగా కొన్ని పాటలను, మరి కొన్ని సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు . తాజాగా ఈ మూవీ సెట్స్ నుంచి నితిన్ ఓ ఫొటోను షేర్ చేసుకున్నారు. అందులో కీర్తి కళ్లపై టవల్ వేసుకొని సేదతీరుతుండగా నితిన్, వెంకీ లు ఫొటో తీశారు .
నితిన్ షూటింగ్లో మేము కష్టపడుతుంటే, కీర్తి ని చూసారా ఎంత హాయిగా సేదతీరుతుందో అంటూ కామెంట్ చేసారు . ఇక ఆ ఫొటోకు కీర్తి కూడా స్పందిచారు. నీకు జలస్గా ఉంది కదా అని కామెంట్ విసిరారు .
ఇదిలాఉంటే రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్గా రంగ్దే షూటింగ్ జరుపుకుంటుంది . ఈ సినిమా లోని ఒక పాట అందరినీ అలరించింది. సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తోన్న ఈ సినిమా కి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా వచ్చే ఏడాది సక్రాంతి కి ఈ సినిమా రానుంది.
You’re just jealous, aren’t you?! 😆 https://t.co/Ot9WDGbMUA
— Keerthy Suresh (@KeerthyOfficial) November 26, 2020