నేడే గురు దత్త జయంతి
ఈరోజు మార్గశిర పౌర్ణమి . . ఈరోజు విశేషాలు తెలుసుకుందాము ఈ కథనంలో.
మార్గశిర పౌర్ణమి ఈరోజు ఉన్న మృగశిర నక్షత్రం కారణంగా ఈ మాసానికి మార్గశిర మాసం అని పేరు.ఈరోజు మరొక విశేషం దత్తాత్రేయ జయంతి. దత్తుడు త్రిమూర్తి స్వరూపం.ముల్లోకాలలో పతివ్రత ఎవరని సందేహం త్రిమూర్తుల పత్నులు అయిన ఉమ కి రమకి భారతికి కలిగాయి. అప్పుడు విష్ణుమూర్తి అనసూయ అని చెప్పాడు.ఆ అనసూయ దేవి పాతివ్రత్యం పరీక్ష చేయగా ఆ పరీక్ష లో నెగ్గిన అనసూయ కి వరంగా త్రిమూర్తుల అంశతో తమకి ఒక కుమారున్ని ప్రసాదించమని కోరగా ఆ త్రిమూర్తి అంశలో గురు అంశగా జన్మించిన వారే దత్తాత్రేయులు.ఆయన జోలె ధరించి, ఆవు తోడి, చతుర్వేదాలుగా భావించే శునకాలు ఆయనను అనుసరిస్తూ ఉంటాయ్. ఆయన గురు స్వరూపుడు ఔడుంబర వృక్షం కింద ధ్యానంలో ఉంటాడు. జగత్ లో ఉండే 24జీవులని తన గురువులు గా స్వీకరించాడు. ఈరోజు దత్త దేవాలయం దర్శన చేసి గురు స్తోత్రం చదవండి.
మరొక విశేషం యమునికి ప్రీతి అయిన కోరల పౌర్ణమి లేదా నరక పౌర్ణమి. ఈరోజు యముని ఆరాధన వల్ల అపమృత్యు దోష నివృత్తి కలుగుతుంది.
జై గురు దత్త
శ్రీ గురు దత్త