కార్తీక శుద్ధ అష్టమి విశిష్టత
కార్తీక శుద్ధ అష్టమి యొక్క విశేషాలు.
నేడు గురువారం తో కూడిన కార్తీక శుద్ద అష్టమి.దీన్నే గోప అష్టమి అన్న విశేషంగా పిలుస్తారు.కార్తీక మాసం లోని ప్రతిరోజు ఏదో ఒక విశేషంతో కూడి యున్నది.
నేటి గోప అష్టమి ని పురస్కరించుకుని శుచిగా ఉదయానికల్లా స్నానంచేసి గోశాలకు వెళ్ళి భక్తితో గోపూజ చేయాలి.గోవు సర్వ దేవతల నిలయం.సకల దేవతలు వివిధ భాగాలలో కొలువై ఉంటారు.గోవుకి ప్రదక్షిణలు చేసి , గోవు యొక్క ప్రుష్ఠ భాగం అనగా వెనక తోక భాగం వైపుకి వెళ్ళి పసుపు , కుంకుమలు సమర్పణ చేసి వీలయితే అరటి పళ్ళు కాని , నీటిలో నాన బెట్టిన నవ ధాన్యాలను బెల్లం తో కలిపి పెట్టడం వల్ల నవగ్రహాలతో పాటు సకల దేవుళ్ళ అనుగ్రహము కలుగుతుంది.
వాస్తవానికి గోవు అన్నది బ్రహ్మ సృష్టిలో లేదు.గోవుని అష్ట వసువులు వేల సంవత్సరాల యజ్ణము చేసిన తర్వాత ఉద్భవించిన మాతృ స్వరూపం.తర్వాత గోవు సకల దేవతలకు నియమం అయింది.ఒక్కో భాగం మీద ఒక్కో దేవిదేవతలూ ఆశీనులై ఉంటారు.గోవును సందర్శన చేసినప్పుడు కామధేను స్తుతి కాని ఎదైనా గోవు యొక్క నామం కాని జపం చేయాలి.గోవుకి ఏదైనా తినిపిస్తే అది సకల దేవతలకు ఆరగించిన ఫలితాన్నిస్తున్నది.
ఓం కామధేనవే నమః