కాఫీ రైతుల కోసం ప్రారంభించబడ్డ రెండు సరికొత్త స్మార్ట్ ఫోన్ యాప్స్
వాణిజ్య మరియు పరిశ్రమల శాఖ మంత్రి సురేష్ ప్రభు మంగళవారం కాఫీ సెక్టార్ కోసం రెండు మొబైల్ యాప్స్ ని కాఫీ రైతులకు ప్రొడక్షన్ మరియు క్వాలిటీని పెంచడానికి ప్రారంభించారు. కాఫీ వాటాదారుల కోసం “ఇండియా కాఫీ ఫీల్డ్ ఫోర్స్ అప్లికేషన్ మరియు కాఫీ KrishiTharanga “- డిజిటల్ మొబైల్ పొడిగింపు సేవలు.
“సాంకేతిక పరిజ్ఞానం యొక్క ఉపయోగం కాఫీ రైతులు ఉత్పత్తి మరియు ఉత్పాదకతను పెంచడానికి సహాయం చేస్తుంది,” అని మినిస్టర్ గారు అన్నారు.
కాఫీ KrishiTharanga సేవలు ఉత్పాదకత, లాభదాయకత, మరియు పర్యావరణ స్థిరత్వం పెంచడానికి సమాచారం మరియు సేవలు అందిస్తుంది.
కాఫీ రైతులు మరియు ఎస్టేట్స్ జియో ట్యాగింగ్ తో డిజిటలైజ్ చేసి, ప్లాంటేషన్ వివరాలను సేకరించి, మొత్తం కార్యకలాపాలను సులభతరం చేయడానికి ఈ అప్లికేషన్లు సహాయపడతాయి.
శాశ్వత కాఫీ ఉత్పత్తి మరియు వర్షపాతం, తెగుళ్ళు మరియు వ్యాధులు వంటి వ్యవసాయ సమస్యలను పరిష్కరించడానికి డేటా అనలిటిక్స్, ఆర్టిఫిసియల్ ఇంటిలిజెన్స్ మరియు బ్లాక్ చైన్ వంటి పైలట్ ప్రాజెక్టులను కూడా మంత్రి ప్రారంభించారు.
కాఫీ భారతదేశంలో 4.54 లక్షల హెక్టార్లలో 3.66 లక్షల కాఫీ రైతులతో సాగు చేస్తారు. కర్నాటక (54 శాతం), కేరళ (19 శాతం), తమిళనాడు (8 శాతం) లకు ఇది సాగు చేయబడుతుంది.
ఇది ఆంధ్రప్రదేశ్ మరియు ఒడిశా (17.2%) మరియు నార్త్ ఈస్టర్న్ రాష్ట్రాలైన (1.8%) వంటి నాన్-ట్రెడిషనల్ ప్రాంతాలలో కూడా పెరుగుతుంది.
కేరళలోని తీవ్రమైన వరదల కారణంగా దెబ్బతిన్న కాఫీ రైతులకు జరిగిన నష్టాన్ని కూడా కాఫీ బోర్డ్ అంచనా వేస్తుంది. అంచనా తర్వాత, ఆ రైతులకు సహాయం చేయడానికి మంత్రిత్వ శాఖ కొన్ని చర్యలు తీసుకుంటుంది.
సో కాఫీ రైతులు ఈ రెండు సరికొత్త యాప్స్ ని యూస్ చేసి తమ కాఫీ పంట దిగుబడిని పెంచుకోవాలి అని ఆశిద్దాం.