పంటని తగలబెడ్తున్న రైతులు, farmers facing problems
నియంత్రిత సాగు ప్రభుత్వ ఆదేశం మేరకు రైతులు సాగు చేసిన సన్న రకం farmers facing problems వరి ధాన్యాన్ని ప్రభుత్వ మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేయాలని భారత జాతీయ మహిళా సమాఖ్య వనపర్తి జిల్లా అధ్య క్షురాలు సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు సీపీఐ పానగల్ మండల కార్యదర్శి శివకుమార్ డిమాండ్ చేశారు . గురువారం వారు కేతేపల్లిలో కార్యకర్తల సమావేశంలో మట్లాడారు ప్రభుత్వం దొడ్డు రకాలను ఏ గ్రేడ్ కింద చేర్చి క్వింటాలుకు పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిది రూపాయలు మద్దతు ధర ప్రకటించి సన్నాలను ఏ గ్రేడ్ కింద చేర్చకుండా క్వింటాలుకు 1868 రూపా యలే ప్రకటించటం దుర్మార్గమని విమర్శించారు .
దొడ్డు రకాలతో పోలిస్తే సన్నాలు క్వింటాలుకు 20 రూపాయలు తక్కువ ఉందని తెలిపారు . దొడ్డు రకాల పంటకాలం సాగు వ్యయం కూడా తక్కువ అని సన్న రకాల కాలవ్య వధి చాలా ఎక్కువ అని గుర్తు చేశారు . దొడ్డు , రకాలకే మంచి ధర ఉండ టంతో గతంలో రైతులు దొడ్డు రకాలు ఎక్కువగా సాగు చేసి లాభం పొందే వారిని ఈసారి నియంత్రత సాగు పేరుతో రైతులు 75 శాతం సన్నాలు వేశా రని గుర్తు చేశారు . పైగా సన్నలకు అనేక రకాల తెగుళ్ళు వర్షానికి కట్టుకునే పరిస్థితి లేకపోవడం వల్ల అగ్గితెగులు కు వర్షాలకు పంటలకు నష్టం జరిగిం దని తెలిపారు రైతు రాజ్యాంలో రైతులు అగ్గి తగలడంతో నష్టం చూడలేక తగ లబెడుతున్నారని తెలిపారు . తెలంగాణ రాష్ట్రంలో వివిధ జిల్లాలలో ఈ పరి స్థితి ఉందని తెలిపారు . నష్ట పరిహారం చెల్లించాలని కోరారు .
farmers facing problems ::
నియంత్రిత సాగులో పొన్నాలను ప్రోత్సహించింది ప్రభుత్వమే అయింనందున కొనుగో లుకు బాధ్యత తీసుకోవాలని డిమాండ్ చేశారు . మెక్కజొన్న వద్దని చెప్పినా రైతులు సాగు చేయడంతో మద్దతు ధరకు కొనుగోలు ప్రభుత్వం ముందుకు వచ్చిన సంగతి ప్రస్తావించారు . ఈసారి పెట్టుబడి ఖర్చులు పెరగటంతో పాటు భారీ వర్షాలకు తెగుళ్ళు పంట నష్టం జరిగింది క్వింటాలుకు 2500 చెల్లించి కొనుగోలు చేయాలని కోరారు . మద్దతు ధర ప్రభుత్వం కొనుగోలు చేసే 2500 మధ్య వ్యత్యాసాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరించాలని కోరారు . ఈసారి భారీ వర్షాలకు ఉమ్మడి పాలమూరు జిల్లాలో పాత పోయి చాలా మంది ప్రాణాలు కోల్పోయారని తెలిపారు . ఇటీవల బుద్ధా లో ఇల్లు మిద్దె కూలి ఐదుగురు మరణించారని తెలి పారు . జిల్లాలో పాత ఇల్లు 30 వేల 959 ఉండగా కేవలం 21 వేల 876 కూల్చివేశారని ఇంకా 9083 ఇల్లు పడగోట్టి వలసి ఉందని తక్షణం పడగొట్టి ప్రాణాలు కాపాడాలని కోరారు . ఎంత మంది ప్రాణాలు పోతే ప్రభుత్వం స్పందిస్తుందని విమర్శిం చారు . మరణించిన ప్రతి వ్యక్తికి 30 లక్షలు ఎక్సేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు .
రేషన్ షాప్ అందుబాటులో ఉండాలి…… కేతేపల్లిలో ప్రభుత్వం రేషన్ షాప్ భగత్ సింగ్ నగ లో పెట్టి ప్రజలకు అందుబాటులో ఉండాలని సమా వేశంలో తీర్మానించారు . గ్రామంలో మూడు రేషన్ షాప్ ఉండగా అన్ని ఒకే చోట ఉన్నాయి కిలోమీటర్లు దూరం నుంచి వినియోగదారులు వచ్చి రేషన్ తీసుకెళ్ల వలసి వస్తుందని తెలి పారు . వాహనాలు ఉన్న వారు వాటిని తీసుకెళ్తున్నారని లేని ముసలి మెదట పిల్లలు రేషన్ తీసుకొనికిలో మీటర్లు నడిచి వెళ్లాల్సి వస్తుందని లేదా బస్సులో తీసుకెళ్లాల్సి వస్తోందని తెలిపారు . తాసిల్దారు స్పందించి ఒక షాపు భగత్ సింగ్ నగర్ కు మార్చాలని కోరారు . సగం గ్రామ పైగా భగత్ సింగ్ నగర్ లోనే ఉందని తెలిపారు . ప్రజావాణిలో తాసిల్దార్ కు కలెక్టర్ కూడా విజ్ఞప్తి చేస్తామని తెలిపారు . ఈ సమావేశంలో సీపీఐ ఏఐటీయుసీ నాయకులు కురువ హనుమంతు ఆంజనేయులు కాశన్న మద్దిలేటి రాముడు , నాయకులు తదితరులు పాల్గొన్నారు .