రాష్ట్రంలో కరోనా విజృంభణ, COVID19 cases in Telangana
తెలంగాణలో కరోనా వైరస్ విలయతాడవం చేస్తుంది.COVID19 cases in Telangana 1018 ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలోనే భారీగా రికార్డు స్థాయిలో 881 కొత్త సు కేస్లు నమోదు కావడం విస్మయం కలిగిస్తోంది . ఆ తర్వాత కేసుల తాకిడి అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలో ఉంది .
తెలంగాణలో కరోనా కేసులు భారీ స్థాయిలో పెరుగుతూనే ఉన్నాయి . మంగళవారం ఒక్కరోజులోనే పెద్ద సంఖ్యలో కరోనా కేసులు నమోదయ్యాయి . మొత్తం 1018 కరోనా కొత్త కేసులు నమోదైనట్లుగా హెల్త్ బులెటిన్ లో పేర్కొన్నారు . దీంతో రాష్ట్రంలో మొత్తం కరోవా కేసుల సంఖ్య 17,357 కు చేరుకుంది . ఇక ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టివ్ కేసులు 8785 గా ఉన్నాయి . గత 24 గంటల్లో 1,712 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు . ఇప్పటి వరకు పూర్తిగా కోలుకొని డిశ్చార్జి అయిన వారి సంఖ్య 7,294 కు చేరింది . ఇక మంగళవారం మరో ఏడుగురు వ్యక్తులు కరోనాకు బలి కాగా , మొత్తం సంఖ్య 267 కి చేరింది .
COVID19 cases in Telangana :
మంగళవారం రోజు గుర్తించిన కరోనా కేసుల్లో జిల్లాల్లోనూ పెద్ద ఎత్తున కేసులను గుర్తించారు . ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలోనే భారీగా రికార్డు స్థాయిలో 881 కొత్త కేసులు నమోదు కావడం విస్మయం కలిగిస్తోంది . ఆ తర్వాత కేసులు ఆధికంగా రంగారెడ్డి జిల్లాలో ఉంది . అక్కడ 33 కేసులు నమోదు కాగా , సంగారెడ్డి జిల్లాలో 3 కొత్త కరోనా కేసులను గుర్తించారు . మేడ్చల్ జిల్లా లో 36 కేసులు నమోదయ్యాయి . ఇక నిజామాబాద్ జిల్లాలో 3, ఆదిలాబాద్ జిల్లాలో 2, మహబూబ్ నగర్ జిల్లాలో 10 , కరీంనగర్ జిల్లాల్లో 2 , సిద్దిపేట 3 , సూర్యాపేట 2 , ఖమ్మం 7 , నిజామాబాద్ జిల్లాల్లో 3 గుర్తించారు .
మరోవైపు తెలంగాణలో మంగళవారం ఒక్కరోజే 3,457 కరోనా టెస్టులు చేశారు . వీటిలో మంచే 1018 కేసులు బయటపడ్డాయి . దీంతో మొత్తం ఇప్పటి వరకూ కరోనా టెస్టుల సంఖ్య 88,563 కు చేరింది . మంగళవారం 2,512 ఫలితాలు నెగిటీగా తేలాయి . కరోనా టెస్టులు చేసే కేంద్రాలివీ .. గాంధీ మెడికల్ కాలేజీ , ఉస్మానియా జనరల్ పోస్పిటల్ , నల్లకుంట ఫీవర్ ఆస్పత్రి , పంజాగుట్ట నీమ్స్ , ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ ( ఐపీఎం ) , కాకతీయ మెడికల్ కాలేజీ ( వరంగల్ ) హైదరాబాద్ సీసీఎంబీ , సెంటర్ ఫర్ డీఎస్పీ ఫింగర్ ప్రింటింగ్ అండ్ డయాగ్నస్టిక్స్ , ఈఎస్సై , రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ( రిమ్స్ , ఆదిలాబాద్ లో కరోన టెస్టులు చేస్తున్నట్లు వివరించారు .