భారత్ లో కరోనా కల్లోలం, COVID19 cases in India
లాక్ డౌన్ వరకూ ప్రపంచంలో పద్దెనిమిదవ స్థానంలో ఉన్న భారత్ సడలింపుల తరువాత చాలా వేగంగా దూసుకువస్తోంది COVID19 cases in India రోజుకు ఇరవై వేలకు తక్కువ కాకుండా కేసులలో అయిదు రోజులకే లక్ష వంతున పెంచుకుంటూ టాప్ టెలో నాలుగవ స్థానానికి చేరుకుంది . ఇప్పుడు మరింత దూకుడుగా మూడవ స్థానానికి ఎగబాకుతోంది .
ఇప్పటికే దేశవ్యాప్తంగా కేసుల సంఖ్య 6 లక్షలను దాటగా , మొత్తం కేసుల సంఖ్యలో మూడో స్థానంలో ఉన్న రష్యా కన్నా 50 వేల కేసులు మాత్రమే తక్కువగా ఉన్నాయి . భారత్ లో రోజుకు దాదాపు 20 వేల కేసులు వస్తున్నవేళ , మరో నాలుగైదు రోజుల్లోనే ప్రపంచంలో కరోనా కేసుల్లో మూడో స్థానానికి భారత్ చేరడం ఖాయంగా కనిపిస్తోంది . తొలి స్థానంలో అమెరికా 26 లక్షలకు పైగా కేసులతో ఉండగా , రెండో స్థానంలో బ్రెజిల్ 14 లక్షల కేసులతో కొనసాగుతున్నాయి . గురువారం నాటికి భారత్ లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 6,05 , 020 కు చేరుకుంది . ఇప్పటి వరకూ భారత్ లో కరోనా కారణంగా 17,848 మంది మరణించారు . ఇప్పటి వరకూ కరోనా నుంచి కోలుకుని 2.21 లక్షల మంది డిశ్చార్జ్ అయ్యారు . దాదాపు 3.80 లక్షల యాక్టివ్ కేసులున్నాయి .
COVID19 cases in India ::
ముంబయి , చెన్నై , ఢిల్లీ , హైదరాబాద్ వంటి నగరాల్లో కేసుల సంఖ్య మరింత పెరుగుతుండటం ఆందోళన కల్గిస్తుంది . ఇక భారత్ లో కొత్తగా వస్తున్న కేసుల్లో 90 శాతం పది రాష్ట్రాల నుంచే వస్తున్నాయి . మహారాష్ట్ర , తమిళనాడు , ఢిల్లీ , గుజరాత్ , ఉత్తరప్రదేశ్ , పశ్చిమ బెంగాల్ , తెలంగాణ , ఆంధ్రప్రదేశ్ , హర్యానా , కర్ణాటక రాష్ట్రాల్లో వైరస్ వ్యాప్తి అధికంగా ఉంది . ఇదే సమయంలో ఢిల్లీలో వైరస్ వ్యాప్తి కాస్తంత తగ్గింది . జూన్ లోనే ఢిల్లీలో కేసుల సంఖ్య లక్షను దాటుతుందని తొలుత అంచనా వేయగా , ప్రస్తుతం 87 వేల కేసులకు ఢిల్లీ చేరుకుంది . కంటెయిన్మెంట్ జోన్లలో పాటిస్తున్న కఠిన నిబంధనలు కొంతమేరకు ప్రభావం చూపుతున్నాయి .
లాక్ డౌన్ నిబంధనలను సడలించడం ప్రారంభించిన తరువాత కేసుల సంఖ్య గణనీయంగా పెరగడం ప్రారంభమైంది . ఈ భయంతోనే ఇప్పటికీ , అంతర్జాతీయ విమానాల సర్వీసును , స్కూళ్లు , కాలేజీలు , పబ్ లను ప్రారంభించేందుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు . ఇక , అన్ లాక్ 2.0 లో భాగంగా కీలక నిర్ణయాలను ఏమీ తీసుకోలేదు . జూన్ నెలాఖరు వరకూ ఉన్న నిబంధనలనే కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది .