భారత్ లో కరోనా విజృంభణ, Coronavirus cases in India
భారతదేశంలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. coronavirus cases in India 5,49,194 కరోనా వైరస్ ను కట్టడి చేయడం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కత్తి మీద సాములా మారింది . ఒక రకంగా చెప్పాలంటే కరోనా విషయంలో భారతదేశం చేతులెత్తేసినట్లుగానే రోజు పరిస్థితులు కనిపిస్తున్నాయి . కరోనా కేసుల తీవ్రత దృష్ట్యా పలు రాష్ట్రాలు లాక్ డాన్ దిశ గా ఆలోచన చేస్తున్నాయి . ఇప్పటికే కేసులు పెరుగుదలతో మణిపూర్ లాక్ డాన్ పొడిగిం చింది . మహారాష్ట్ర మరియు తెలంగాణ కూడా అదే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది .
ఆరు రోజుల్లోనే లక్షకు పైగా కేసులు కరోనా కేసులు పెరుగుదల చూస్తే తప్పక షాక్ అవుతారు . ఆరు రోజుల్లోనే లక్షకు పైగా కేసులు నమోవైన పరిస్థితి రాజుగా ఇండియాలో కనిపిస్తోంది . కరోనా వైరస్ ప్రారంభదశలో లక్ష కేసులు నమోదు కావడానికి 109 రోజుల సమయం పడితే , ఇప్పుడు ఆరు రోజుల్లోనే లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి . అంటే కరోనా కట్రోల్ లో మన ప్రభుత్వాలు విఫలమయ్యాయని చెప్పడ తప్పుడు .
coronavirus cases in India ::
24 గంటల్లో 19700 మందికి కరోనా పాజిటివ్ అని అధికారికంగా చెప్పిన లెక్క , అనధికారికంగా కూడా ఇప్పటి ముబ్బడిగా కరోనా కేసులు పెరుగుతున్న పరిస్థితి ప్రజలను ఆందోళనకు గురి చేస్తుంది . మన దేశంలో గత 24 గంటల్లో 19700 మందికి కొత్తగా కరోనా సోకిందని కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటన విడుదల చేసింది . ఒక్క రోజులో నమోదైన అత్యధిక కేసులు ఇవేనని చెప్పారు . ఇలా రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతున్నా ప్రభుత్వాలు ఏం చేయలేని పరిస్థితి ప్రస్తుతం విస్మయం కలిగిస్తోంది . దేశంలో కరోవా వైరస్ కేసుల సంఖ్య ప్రస్తుతం 5,49,197. అనుపత్రులలో కరోనా పేషెంట్లకు అందుతున్న వైద్యంలో కూడా అడుగడుగున లోపాలు కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయి . వారికి సరైన ఆరోగ్య రక్షణ అందడం లేదని ఆందోళనలు వెల్లువెత్తుతున్నాయి .
దేశవ్యాప్తంగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 384 మంది . గత 24 గంటల్లో మృతిచెందారని అధికారకంగా విడుదల చేసిన జూబితాలో తేలింది . దేశవ్యాప్తంగా కరోనా వైరస్ కేసుల సంఖ్య ప్రస్తుతం చూపినట్లయితే 5,49 , 197 కేసులు నమోదయ్యాయి . ఇప్పటివరకు కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య మొత్తం 16,475 కి పెరిగింది . 2,10,120 మంది ఆసుపత్రులలో చికిత్స పొందుతుండగా , ఇప్పటివరకు 3.2 లక్షల మంది కరోనా నుండి కోలుకున్నట్లుగా తెలుస్తోంది . ఏదేమైనా కరోనా కేసులు పెరుగుతున్న తీరు మరొకసారి లాక్ డాన్ పై ప్రజుల్లో ఆసక్తికర చర్చకు కారణమవుతోంది. కరోనాను కంట్రోల్ చేయ లేకపోతున్న ప్రభుత్వాలు పైకి గంభీరంగా కనిపిస్తున్నా లోలోపల టెన్షన్ పడుతున్నాయి . అదే స్థాయిలో కరోనా కేసులు పెరిగితే భారతదేశ పరిస్థితి మరింత అధ్వానంగా మారుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు .