Today Telugu News Updates

కరోనా మృతదేహాల పట్ల అమానుషం, Corona dead bodies cremation

కర్ణాటకలో కరోనా వైరస్ మృత దేహాల కననంలో Corona dead bodies cremation ఘోర సంఘటన వేర్వేరుగా ఖననం చేయకుండా 9 మృతదేహాలను పెద్దగొయ్యిలో విసిరివేత బళ్లారిలో జరిగిన ఘటన  పై వెల్లువెత్తిన విమర్శలు బాధ్యులను సస్పెండ్ చేసిన కర్ణాటక సర్కార్.

 బళ్లారి , జులై 2 కరోనా వైరస్ చనిపోయిన వారి కుటుంబాలు అప్పటికే పుట్టెడు దుఃఖంలో ఉంటే , వారి హృదయాలు మరింత క్షోభించేలా అధికార సిబ్బంది వ్యవహరించారు . కరోనాతో చనిపోయిన వారి మృతదేహాలను పెద్ద గొయ్యి తీసి నిర్దాక్షిణ్యంగా అందులో విసిరివేయడం అందరినీ నివ్వెరపరచింది . బళ్లారిలో చోటుచేసుకున్న ఈ ఘటన వీడియోలు వెలుగులోకి రావడంతో జిల్లా యంత్రాంగం నిర్వాకంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి .

Corona dead bodies cremation ::

 బళ్లారిలోని విమ్స్ కోవిడ్ విభాగంలో కరోనాతో చికిత్స పొందిన బళ్లారికి చెందిన 60 ఏళ్ల వృద్ధుడు , సిరుగుప్పకు చెందిన 31 ఏళ్ల యువకుడు , కొప్పళ జిల్లాకు చెందిన 52 ఏళ్ల వ్యక్తి , ఆంధ్రప్రదేశ్ లోని ఆదోనికి చెందిన 41 , 52 ఏళ్ల వయస్సున్న ఇద్దరు వ్యక్తులు , చిత్రదుర్గంకు చెందిన 70 ఏళ్ల వృద్ధుడు , శ్రీరంగాపురం క్యాంపకు చెందిన 43 ఏళ్ల వ్యక్తి , హాసపేటకు చెందిన మరో ఇద్దరు మృతి చెందారు . తొమ్మిది మరణాలతో ఆస్పత్రి ప్రాంగణంలో బంధుమిత్రుల రోదనలు మిన్నంటాయి . కరోనా మృతుల అంత్యక్రియలను వైద్య సిబ్బంది ఆధ్వర్యంలోనే నిర్వహించాల్సి ఉన్నందున , మృతదేహాలను నల్లరంగు బ్యాగ్ లో చుట్టి అంబులెన్సుల్లో శ్మశానానికి తీసుకెళ్లారు . పొక్లెయినర్ పెద్ద గొయ్యిని తీసి అన్నింటినీ గొయ్యిలో విసిరేశారు . విడిగా సమాధి చేయకుండా కరోనా మృతదేహాల ఖననంలో నిర్లక్ష్యం వహించిన ఈ ఘటనకు బాధ్యులను సస్పెండ్ చేసినట్లు కర్ణాటక మంత్రి శ్రీరాములు వెల్లడించారు .

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button