ఈరోజు విశిష్టతను తెలుసుకుందామా
ఈరోజు మార్గశిర శుద్ధ చతుర్దశి, శుక్రవారం యొక్క విశిష్టత తెలుసుకుందాం ఈ కథనంలో . . .
ఈరోజు శుక్రవారం కావున ప్రత్యేకంగా అమ్మవారిని మహాలక్ష్మి రూపం లో లేదా ధనుర్మాసం కావున గోదాదేవి రూపం లో అర్చన చేయాలి. అమ్మ వారికి పురుషకారిణి అన్న పేరు కలదు. నారాయణుడు తీసుకునే ప్రతి నిర్ణయం లోనూ అమ్మవారి సలహా సూచన ఉంటుంది. అంతే కాకుండా అమ్మవారికి నిత్యాన్న పాయిని, నారాయణ ప్రణయిణి అన్న పేరు కలదు. అమ్మవారి పూజచేసిన కూడా అందులో తప్పకుండా నారాయణుని పేరు తప్పకుండా తలవాలి.
ఈరోజు చేసే మహాలక్ష్మి పూజలో తెల్లని పూలు, తెల్లని వస్త్రాలు ఉపయోగించాలి. శ్రీ సూక్తం , కనకధారా స్తోత్రం పఠనం చేయాలి. అమంగళకరమైన పనులు చేయరాదు.అమ్మవారికి ఆరావలి కుంకుమ తో అర్చన చేయడం వల్ల శుక్రగ్రహ దోషాల నివృత్తి జరుగుతుంది. బియ్యం, పెసరపప్పు, ఉప్పు, మిరియాలు, నెయ్యి ఉపయోగించి పొంగలి నివేదన చేసి ఆ ప్రసాదాన్ని పదిమందికి పంచాలి. అమ్మవారు త్రిశక్తి స్వరూపం కావున ఈరోజు రాహుకాల సమయంలో ఎండిన నిమ్మ దోప్పలలో శక్తి ఆలయంలో దీపారాధన చేయాలి. దీపారాధన చేసే సమయంలో మన వెంట ఎవరైనా ఒకరు తప్పక ఉండాలి.ఒంటరి గా రాహుకాల దీపారాధన చేయరాదు.