Athadu Sequel : అతడు కంబినేషన్స్ మళ్ళీ రిపీట్?
Athadu Sequel : అతడు సినిమా అప్పట్లో ఎలా ఆడిందో, ఏ విధంగా రికార్డులు కోటిందో చెప్పనక్కర్లేదు. అయితే అతడు తర్వాత మహేష్ బాబు, త్రివిక్రమ్ కలిసి ఖలేజా సినిమా చేశారు. ఈ సినిమా థియేటర్లలో సరిగా ఆడలేకపోయిన టీవీ లో టెలికాస్ట్ చేశాక బ్లాక్ బస్టర్ అని ముద్ర వేశారు ప్రజలు.
దాదాపు 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ త్రివిక్రమ్ ,మహేష్ కలిసి సినిమా చేయబోతున్నారు అని కన్ఫర్మేషన్ ఇచ్చారు. అయితే ఈ సినిమా సర్కారు వారి పాట అయిపోయాక తీయబోతున్నారు అని, ఈ చిత్రం లో ప్రతిదీ ఆచి , తూచి దగ్గరుండి అతడు లాంటి బ్లాక్ బస్టర్ కొట్టాలనే ఆలోచనలోనే ఉన్నారు త్రివిక్రమ్.
కాబట్టి త్రివిక్రమ్ అతడు కాంబినేషన్ ఏ మళ్ళీ తెరపై చూపించాలి అని అనుకున్నారేమో త్రిషని హీరోయిన్ గా పెట్టాలని చిత్ర బృందం చర్చలు జరుపుతున్నారు.
మహేష్ , త్రిష జంట ఇంకోసారి కలిసి అతడుకి మించి హిట్ కొట్టాలనే త్రివిక్రమ్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. చూడాలి మరి ఈ వార్తే కనుక నిజం అయితే పార్థు, పూరీలా ప్రేమని ఇంకోసారి కొత్తగా చూసేయచ్చు.