ఎలాంటి శ్రమ లేకుండా బరువును తగ్గించే వాము నీళ్ళు
నేటి ఆధునిక జీవన విధానంలో ప్రతి రోజు ఒరుకుల పరుగుల జీవితంతో ఆరోగ్యవంతమైన ఆహారాన్ని తీసుకునే తీరిక లేకపోగా సులభంగా లభించే జంక్ ఫుడ్ కి అలవాటు పడి చాలా మంది ఊబకాయం బారిన పడుతున్నారు. ఈ అధికా బరువుని తగ్గించుకోవడానికి ఎన్నో రకాలుగా ప్రయత్నిస్తున్నారా? శరీరంలో అధికంగా పేరుకుపోయిన కొవ్వు లేదా అధిక బరువును తగ్గించుకోవడం అంత సులువు కాదు అని తెలిసిందే.
రోజూ వ్యాయామం చేస్తూ పౌష్టికాహారం తీసుకుంటే తప్ప అధిక బరువు తగ్గదు. ఖచ్చితమైన ఆహార, వ్యాయామ నియమాలను పాటించాల్సి ఉంటుంది. అయితే మన వంటిoట్లో లభించే మరియు ఎక్కువగా ఉపయోగించే వాముతో కేవలం 15 రోజుల్లోనే 5 కిలోల వరకు బరువు తగ్గవచ్చు.
మరి అది ఎలాగో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? ఒక టేబుల్ స్పూన్ మోతాదులో వాము గింజలను తీసుకుని రాత్రంతా నీటిలో నానబెట్టాలి. ఉదయాన్నే ఆ నీటితో సహా గింజలను అలాగే ఉంచి మరిగించాలి. అనంతరం గింజలను వడకట్టగా వచ్చే నీటిని తాగాలి. ఈ నీటిని ఉదయాన్నే పరగడుపున తాగాలి. తాగిన తరువాత గంట వరకు ఏమీ తినకూడదు. ఇలా రోజూ చేస్తే ఖచ్చితంగా బరువు తగ్గుతారు. అయితే ఈ నీటిని రోజుకు 3 పూటలా భోజనానికి గంట ముందు తీసుకుంటే మరింత ఎక్కువ ఫలితం ఉంటుంది. తక్కువ రోజుల్లోనే అధికంగా బరువు తగ్గి మంచి ఫలితాలను పొందవచ్చు.