Today Telugu News Updates

16 ఏళ్ల బాలికలే టార్గెట్ గా….నీచానికి ఒడిగట్టిన ప్రభుత్వ ఉద్యోగి !

targeted by 16-year-old girls

ఉత్తరప్రదేశ్ లోని రాష్ట్ర ఇరిగేషన్ శాఖలో పనిచేసే రామ్ భవన్ అనే వ్యక్తి పది సంవత్సరాలనుండి ఈ దారుణాలకు పాల్పడుతున్నాడు. ఇప్పటివరకు 50 మంది చిన్నారుల పై తన కామవాంఛ తీర్చుకున్నాడు.

వీరిలో చాల మంది మైనర్ బాలికలే ఉండటం ఆశ్చర్యానికి గురిచేస్తుంది. పేద చిన్నారులనే లక్ష్యంగా చేసుకొని ఈ దారుణాలకు పాల్పడ్డాడని తెలుస్తుంది.

ఈ విషయం బయటికి చెప్పకుండా ఆ బాలికలకు బహుమతులు ఇచ్చి చేతులు దులుపుకునే వాడు. ఇతనిపై లైంగిక ఆరోపణలు ఉన్నప్పటికీ ఆధారాలు లేకపోవడంతో ఇప్పటివరకు తప్పించుకొని ఈ అఘాయిత్యాలకు పాల్పడుతూ వచ్చాడు.

ఈ మధ్య ఇతనిపై మళ్లీ లైంగిక ఆరోపణలు రావడంతో ఈ కేసును గట్టిగ దర్యాప్తు చేయగా పై  విషయాలు బయటికి వచ్చాయి. దీనికి సంబదించి అతడే స్వయంగా ఒప్పుకున్నాడని పోలీసులు తెలిపారు.

ఇంతటి అఘాయిత్యానికి పాల్పడిన రామ్ భవన్ కి కఠిన శిక్ష పడేలా చూస్తామని ఉన్నత అధికారులు వెల్లడించారు.

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button