కార్తీక బహుళ చతుర్దశి ఆరాధన
కార్తీక బహుళ చతుర్దశి రోజున ఆరాధన.
కార్తీక బహుళ చతుర్దశి కార్తీక మాసం లో ఇరవై తొమ్మిదవ రోజు. ఈరోజు గురువారం తో కుడి వచ్చింది.ఈరోజు న కార్తీక పురాణం 29అధ్యాయం పారాయణ చేయాలి.ఈరోజు ఏక భుక్తం చేయాలి, ఆహార పదార్థాల్లో ఉల్లి వెల్లులితో పాటు ఉసిరికాయ నిషిద్దం.ఈశ్వర ఆరాధన వల్ల ఆప మృత్యు దోషం పోతుంది. అంతే కాకుండా ఈరోజు న చేయు విష్ణు ఆరాధన వల్ల వైకుంఠ సాయుజ్యం లభిస్తుంది.
ఈరోజు చేయు దీపారాధన కూడా విశిష్ట వంతమైందే.కార్తీక పురాణ కథనాల్లో ఉండే పోలమ్మ ఈ మాసం చేసిన దీపారాధన, పూజ ఫలితం వల్ల పుష్పక విమానం లో బొందితో స్వర్గానికి పోయిన సంఘటన మనం గుర్తుకు తెచ్చుకోవచ్చు. పోలి స్వర్గం విశిష్టత ఈరోజు తప్పకుండా తెలుసుకోవాలి. స్త్రీలు ఈరోజు దేవలయాల్లో ఉసిరిక దీపం వెలిగించాలి. అరటి దొన్నెల్లో ఉసిరి దీపాలు వెలిగించి దేవాలయ కోనేరు లో గాని, పారే నీటిలో కాని కార్తీక దీపం గా వదలాలి. దామోదరుని తలుస్తూ ప్రతి పుణ్య కార్యం ఈరోజు చేయండి ఉత్తమ ఫలితాలు కలుగుట ఖాయం.
ఓం దామోదరాయ నమః