Today Telugu News Updates

హీరో సుశాంత్ కేసు విషయం లో సీబీఐ విచారణను మరింత వేగవంతం:-

హీరో సుశాంత్ కేసు విషయం లో  సీబీఐ టీం ముంబైలోని ఉంటూ ఎంక్వైరీ చేస్తున్నారు. ఆదివారం సుశాంత్ దగ్గరి మిత్రులను, ఇంట్లో పనివారిని విచారించారు అధికారులు.

ఈ కేసులో సుశాంత్ ప్రియురాలు రియా మీద తీవ్ర స్థాయిలో ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలో ఆమెను అరెస్ట్ చేసే అవకాశం కనబడుతుంది.

అలాగే సుశాంత్ కు సంబదించిన  సోషల్ మీడియా పోస్టులు , వాట్సాప్ చాట్, ఫ్యామిలీ, మిత్రులతో  ఆయన మాట్లాడిన విషయాలు ఇలా ప్రతీ ఒక్క అంశాన్ని తెలుసుకుంటున్నారు.

ఇప్పటికే ఈ కేసుకు సంబందించి  ముంబై పోలీసులు, పాట్నా పోలీసులు విచారణ జరుపుతుండగా ఇపుడు  తాజాగా సుప్రీం కోర్టు ఉత్తర్వులతో సీబీఐ కూడా ఎంటరైంది. ముంబై పోలీసుల దగ్గరినుండి  పూర్తి సమాచారం తీసుకున్న సీబీఐ జాతీయ స్థాయి నిపుణులతో కేసు విచారణ కొనసాగుతుంది.

సుశాంత్ దేనికి ఎలా రియాక్ట్ అవుతాడు లాంటి విషయాలను కూడా ఆయన సన్నిహితులను అడిగి తెలుసుకుంటున్నారు. దీని  వలన తన  మెంటల్ స్టేటస్ ఏంటి అన్న అంశాల మీద ఓ అవగాహనకు రావచ్చని విచారణ బృందం  ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తోంది.

అయితే పూర్తి విచారణ సరళిని మైండ్ పోస్టమార్టమ్ అని వ్యవహరిస్తారని తెలుస్తోంది. అత్యంత క్లిష్టమైన కేసుల్లో మాత్రమే ఈ విధానాన్ని అనుసరిస్తారు .

అయితే మన భారతదేశం లో ఇలాంటి విచారణ చేయడం ఇది 3వ సారి ,ఇంతకముందు సునంద పుష్కర్ ,మరియు బురారీ ఆత్మహత్యల విషయం ఎలాంటి మైండ్ పోస్ట్మార్టమ్ నిర్వహించారు .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button