Today Telugu News Updates

“రోడ్డు ఎప్పుడు వేయిస్తారంటూ” ఎమ్మెల్యే ని ప్రశ్నించిన బుడ్డోడు

ఎన్నికల వచ్చినప్పుడే రాజకీయ నాయకులు మన ఊర్లోకి లేదా పట్టణలోకి వస్తారు.. ఒకవేళ గెలుపొందిన తర్వాత మన ఊరికి వచ్చిన ఏమైనా సమస్యలు ఉంటే ఆ నాయకునికి తెలియజేద్దాం అంటే నాయకుల అనుచరులు అడ్డుకుంటారు. కానీ ఒక చోట ఓ బుడ్డోడు “ఎమ్మెల్యే సార్ మా వాడకు రోడ్డు ఎప్పుడు ఎత్తారు? ” అని ధైర్యంగా ఎమ్మెల్యేను ప్రశ్నించాడు. ఈ ఘటన కరీంనగర్ జిల్లాలో చోటు చేసుకుంది.

కరీంనగర్ పట్టణంలోని గంగాధర మండల కేంద్రంలోని సర్వరెడ్డిపల్లి గ్రామంలో స్థానిక ఎమ్మెల్యే సుంకే రవి శంకర్ పలు అభివృద్ధి కార్యక్రమాలను శుక్రవారం ప్రారంభించడానికి వచ్చారు. ఈ క్రమంలో అదే గ్రామానికి చెందిన యశ్వంత్ అనే బాలుడు “మా వాడుకు రోడ్డు లేదు సార్..ఎప్పుడు రోడ్డు ఏస్తారు?” అని నిర్మొహమాటంగా ప్రశ్నించాడు. దీంతో ఎమ్మెల్యే ఆ బాలుడి ధైర్యాన్ని చూసి మురిసిపోయి.. గ్రామ సర్పంచ్ తో రోడ్డుకు సంబంధించిన ఎస్టిమేషన్ ఖర్చు వేయించారు. త్వరలో మీ వాడకి రోడ్డు వేయిస్తానన్ని బాలుడికి ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈ బాలుడు ఇప్పుడే ఇలా ఉంటే.. రేపు భవిష్యత్తులో మాకు కష్టమే అంటూ సరదాగా ఎమ్మెల్యే నవ్వుకున్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button