ప్రేమ పెళ్లి చేసుకున్న భార్య ఫోన్కు వాట్సప్ కాల్.. ఇక అనుమానం తో ..
నేటి సమాజంలో భార్య భర్తలు పిచ్చి పిచ్చి అనుమానాలతో హత్యలు తీసుకుంటున్న ఘటనలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. కొందరు వివాహేతర సంబంధలతో, మరి కొందరు కుటుంబ కలహాలతో హత్యలకు పాల్పడుతున్నారు. అలాంటిదే మధ్యప్రదేశ్లోని ఇండోర్లో దారుణ ఘటన చోటుచేసుకుంది..ప్రేమించి పెళ్ళి చేసుకున్న భర్తే భార్యను అతి కిరాతకంగా హత్య చేశాడు. పూర్తి వివరాల్లోకి వెళితే…హర్ష శర్మ(23), అన్షు(22) ఇద్దరు గత కొన్నేళ్లుగా ప్రేమించుకొని మూడు నెలల క్రితమే వివాహం చేసుకున్నారు…
అన్షు కి హర్ష కు పరిచయం కాకముందు సచిన్ అనే తెలిసిన బంధువుతో నిశ్చితార్థం నిశ్చయించారు….కానీ చివరికి ఆ నిశ్చితార్థం ఆగిపోయింది… పెళ్లయిన తర్వాత …అన్షు సచిన్ తో సహితంగా ఉండడంతో హర్ష అనుమానించడం మొదలు పెట్టాడు….దీంతో హర్ష …అన్షుతో తరుచు గొడవ పడుతూ ఉండేవాడు… అక్టోబర్ 27న …అన్షు ఫోన్ కి ఓ వాట్స్అప్ కాల్ వచ్చింది… దీంతో వాట్సప్ కాల్ సచిన్ దేనని అనుమానంతో…తీవ్ర ఆగ్రహానికి గురై భార్యను గొంతు పిసికి దారుణంగా హత్యచేశాడు. ఈ మేరకు పోలీసులు భర్తని అరెస్ట్ చేసి… రిమాండ్ కు తరలించారు.