Today Telugu News Updates

తెలంగాణలో దారుణం…యువతిపై యాసిడ్ దాడి

తెలంగాణ రాష్ట్రంలో అమానుషమైన దారుణ ఘటన చోటుచేసుకుంది. జగిత్యాల జిల్లాలో ఓ మహిళపై కొందరు యువకులు యాసిడ్ దాడి చేశారు. ఈ ఘటన రాష్ట్రమంతటా చర్చనీయాంశంగా మారింది.

పూర్తి వివరాల్లోకి వెళితే జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇబ్రహీంపట్నం మండలంలోని తిమ్మాపూర్ తండా కు చెందిన భూక్యా స్వాతి(25) అదే మండలంలోని డబ్బా గ్రామానికి చెందిన ఓ వ్యక్తితో వివాహం జరిగింది. వివాహమైన ఏడాదికి అనారోగ్యంతో తన భర్త మరణించాడు. అప్పటికే ఆమెకు ఒక కొడుకు ఉన్నాడు. ఓ వివాహ వేడుకకు స్వాతి తన చెల్లెలు తో కలిసి హాజరై తిరిగి వెళ్తుండగా తిమ్మాపూర్ బస్టాండ్ వద్ద గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు హెల్మెట్ ధరించి బైక్ పై నుండి వచ్చి ఆసిడ్ దాడి చేశారు. దీంతో ఆ మహిళను స్థానికులు మెట్టుపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆ ఇద్దరు నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వెంకట్ రావు తెలిపారు.

ఈ ఘటనపై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ మేరకు జగిత్యాల్ సింధు శర్మ తో ఫోన్లో మాట్లాడారు. ఈ దాడి చేసిన వారిని వదలదని, వారిపై కఠినంగా చర్యలు తీసుకోవాలని సింధు శర్మకు సూచించారు. ప్రజల ఆరోగ్య పరిస్థితిపై ఎమ్మెల్సీ కవిత ఆరా తీశారు. అలాగే సింధుశర్మ ఆసుపత్రిలో పర్యటించి ఘటన వివరాలు అడిగి తెలుసుకున్నారు.

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button