Today Telugu News Updates
ట్రిపుల్ ఐటీ విద్యార్థిని అనుమానాస్పద మృతి:-
IIIt girl suicide :: ట్రిపుల్ ఐటీ విద్యార్థిని తేజస్విని అనుమానస్పదంగా మృతి చెందింది. ఈ సంఘటన జగిత్యాల జిల్లా మల్యాల మండలం లో చోటుచేసుకుంది.
తేజస్విని అంతక్రియలను తల్లిదండ్రులు రహస్యంగా నిర్వహించడానికి ప్రయత్నిచారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు అంతక్రియలను అడ్డుకొని మృతికి సంబదించిన కారణాలను తెలుసుకొనే ప్రయత్నం చేసారు.
మృతురాలి మెడభాగం పై గాయాలు ఉండండంతో,తనది హత్యా లేక ఆత్మహత్య అనే విషయం పై దర్యాప్తు చేస్తున్నారు.
తేజస్విని బాసర ట్రిపుల్ ఐటీ లో 3వ సంవత్సరం చదువుతుంది. కరోనా కారణంతో ఇంటివద్దే ఉంది ఇలా మృతి చెందడంతో ఆ ఊరి ప్రజలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.