Political News
ఏఐసీసీ అధ్యక్ష పదవి పట్ల తనకు ఆసక్తి లేదని తెలిపిన: సోనియాగాంధీ

ఈ రోజు ఉదయం 11గంటలకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ వీడియో కాన్ఫరెన్స్ సమావేశంలో ఏఐసీసీ అధ్యక్ష పదవికి సోనియాగాంధీ రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.
అధ్యక్ష పదవి పట్ల తనకు ఆసక్తి లేదని, ఈ సందర్భంగా సోనియాగాంధీ తెలిపారు. మరో అధ్యక్షుడిని ఎన్నుకోవాలని సమావేశం లో పాల్గొన్న సభ్యులకు సూచించారు.
సోనియా రాజీనామాను సభ్యులకు కేసీ వేణుగోపాల్ గారు చదివి వినిపించారు. కాగా ఈ సందర్భంగా ఏఐసీసీ అధ్యక్ష పదవికి సోనియా గారు,మాజీ ప్రధాని మన్మోహన్ పేరును ప్రతిపాదించారు.
కానీ ,మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ సీనియర్ నేత ఏకే అంటోని మాత్రం సోనియాగాంధీ గారే అధ్యక్షురాలిగా ఉండాలని సమావేశం లో కోరుకున్నారు.