telugu gods devotional information in telugu

శుక్రవారం అభిషేక విశిష్టత

తిరుమల లో ప్రతి శుక్రవారం జరిగే అభిషేక విశేషాలు తెలుసా ? ? ?

శుక్రవారం నాడు ఉదయాన నాలుగు గంటల బ్రహ్మ ముహూర్తం లో అభిషేక సేవ జరుగుతుంది.స్వామి వారి నగలన్ని సడలింపు చేసి మొదట గో క్షీరాంతో , తర్వాత శుద్ధ గంగా జలం తో , తర్వాత సుగంధ ద్రవ్యాలు కలిపిన హరి చందనంతో తర్వాత మళ్ళీ శుద్ధ జలం తో అభిషేకం చేస్తారు.

శుక్రవారం నాటి అభిషేక సమయాన స్వామి వారి అందచందాలు సొగసులు వర్ణించడం మహాకవుల వల్ల కూడా కాలేదు .భగవత్ రామానుజుల వారు స్వామి వారు స్వామి హృదయం మీద బంగారు అలమేలు మంగ ను వేసిన శుక్రవారం నుండే ఈ ఆచారం మొదలైంది.మొదట తిరుమలనంబి వంశస్థులు ఇచ్చిన బంగారు శంఖ తీర్ధం జియ్యఁగారు తీసుకుని హరి ఓం తో మొదలు పెట్టి సహస్ర శీర్ష . . . అన్న సూక్తంతో మొదలు పెట్టగా పండితులు వేద పారాయణం చేస్తారు.స్వామి వారి వరద హస్తం నుండి జాలువారిన పాలను ప్రసాదంగా ఇస్తారు

ఈ అభిషేక దర్శనం వల్ల ఉత్తమోత్తమ శుభాలు కలుగుతాయని వైఖాసన శాస్త్రం చెబుతుంది.
ఓం నమో వేంకటేశాయ

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button