శబరిమలలో నేడు ఉద్రిక్తత
*ఈ రాత్రి నుంచి శబరిమలలో నిషేధాజ్ఞలు..*
😡 😢
ఈ రాత్రి నుంచి 6వ తేదీ రాత్రి వరకు శబరిమలలో నిషేధాజ్ఞలు అమల్లోకి వస్తున్నాయి.
అయ్యప్ప సన్నిధానం, నీలక్కల్, పంబా నది ఏరియాల్లో 144 సెక్షన్ అమల్లో ఉంటుందని పతనంతిట్ట కలెక్టర్ ప్రకటించారు.
కేరళ ప్రభుత్వం 3వ తేదీ రాత్రి నుంచే కర్ఫ్యూ విధిస్తుందన్న వార్తలు కూడా వచ్చాయి.
అయితే నిషేధాజ్ఞలు మాత్రం పక్కాగా అమలు జరుపుతామని పోలీసులు అంటున్నారు.
మీడియాను 5వ తేదీన అనుమతించాలని నిర్ణయించారు. 5వ తేదీన టెంపుల్ గేట్లు తెరుస్తారు. 6వ తేదీ అర్ధరాత్రి మళ్లీ గేట్లు మూసేస్తారు.
ఈ మధ్య కాలంలో దర్శనానికి వచ్చే భక్తులకు సహకరించేందుకు కేరళ పోలీసులు భారీ ఎత్తున భద్రతా చర్యలు చేపట్టారు.
1,500 మంది పోలీసు అధికారులు భద్రతా చర్యల్ని పర్యవేక్షిస్తారని పతనంతిట్ట ఎస్పీ చెప్పారు. ఇప్పటివరకైతే దైవదర్శనం కోరుతూ మహిళల నుంచి రిక్వెస్టులు అందలేదని, ఒకవేళ అందితే.. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు వారికి దర్శనం చేయించేందుకు పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటామని, ఈ క్రమంలో జరిగే ఎలాంటి ప్రతీకార చర్యనైనా అడ్డుకుంటామన్నారు.
ఇటీవల మాస పూజల కోసం ఆలయం తెరిచినప్పుడు దైవ దర్శనం కోసం పలువురు మహిళా భక్తులు పోలీసు అనుమతి కోరారు.
శబరిమల పరిసరాల్లో భద్రత కోసం 20 మంది డీఎస్పీలు, 42 మంది సీఐలు, 78 మంది ఎస్సైలు, 1876 మంది సివిల్ పోలీసులు, 105 మంది మహిళా పోలీసు అధికారులను నియమించినట్టు ఎస్పీ చెప్పారు.