ఈరోజు హనుమత్ వ్రతం
ఈరోజు మార్గశిర శుద్ద త్రయోదశి హనుమత్ వ్రతం అని అంటారు.
ఈరోజు హనుమత్ వ్రతం హనుమంతుని అనుగ్రహం సులభంగా పొందుటకు అనుకూలమైన రోజు.అమేయ శక్తి సంపన్నుడు ఈరోజే సాగర లంగణ చేసి అశోకవనం లో ఉన్న సీతాదేవిని దర్శనం చేసిన రోజు.
ఈ హనుమత్ వ్రతాన్ని పంపా నదీ తీరంలో కల్పోక్తముగా చేయాలి. ముఖ్యంగా అరటితోటలో చేస్తే మరింత శుభం. పంపానది తీరం వెళ్ళలేని వారు ఈరోజు కలశంలో ప్రత్యేక మంత్రంతో పంపానదిని ఆవాహన చేసి ఆయన శక్తి అయిన సువర్చలా ధ్యానం చేసి పదమూడు ముడుల తోరమును రక్ష గా కట్టుకోవాలి.ఆచార్యుల సమక్షంలో చేస్తే మరింత శుభం.
మొదట ఈ వ్రతాన్ని హనుమ సాక్షాత్ రాముల వారితో, ద్వాపర యుగంలో వ్యాసుడు పాండవులతో, అంతకన్న ముందు ద్రౌపదితో కృష్ణుడు చేయించాడు. హనుమంతుడు చిరంజీవి గా అన్ని యుగాల్లో భక్తుల కరుణిస్తు ఉన్నాడు. ఆయన బాల్యంలో ఆయన సకల దేవతల వల్ల పొందిన వర ప్రభావం. కలియుగం లో కూడా సాక్షాత్ తులసీదాస్ కి మోక్షం కలిగించాడు. ఇలాంటివి ఇంకా ఎన్నో కోకొల్లల్లు ఉన్నయి.
ఓం శ్రీ హనుమతే నమః