అయ్యప్పస్వామి దీక్ష శని అనుకూలత ఎలా ఇవ్వగలదు ?
కార్తీక మాసం శివ కేశవులకు ప్రీతివంతమైన మాసం.హరిహరుల పుత్రుడైన అయ్యప్పస్వామి వారి దీక్షా కాలం ఇదే, మండలం రోజులు కఠిన వ్రత నియమాలను ఆచరించి అయ్యప్ప స్వామి అనుగ్రహము తో పాటు నవగ్రహాల అనుకూలత పొందవచ్చు.
అయ్యప్ప స్వామి దీక్ష సకల శని దోషాలు పోగొడుతుంది. దీనికి కారణం శని భగవానుడికి అయ్యప్ప స్వామి ఇచ్చిన వరమే. అది ఏమంటే శని భగవానుడు త్రిమూర్తుల వలె కర్మల యొక్క ఫలితం ఇచ్చే భగవానుడు, వ్యక్తి చేసినటువంటి కర్మలను బట్టి ఫలితం ఇస్తాడు, భాదిస్తాడు. మన యొక్క పాపాన్ని బట్టి బాధించడం ఉంటుంది. పాపం పూర్తిగా పరిహరించే వరకు ఆయన ఫలితం ఇస్తాడు . . వెనువెంటనే నీతి ని భోదించి శుభ ఫలితాలు ఇస్తాడు.
ఇక అయ్యప్ప దీక్ష లో ఉన్నటువంటి అన్ని నియమాలు శని కలిగించే ఇబ్బందులే. . వీటన్నింటిని భక్తులు తమ దీక్షా కాలం లో ఇష్టంగా , నియమంగా, నీతి గా పాటిస్తారు కాబట్టే అయ్యప్పస్వామి దీక్ష తీసుకున్న వారిని ఎలాంటి ఇబ్బంది పెట్టనని అలనాడు స్వామి వారికి శని ఇచ్చిన మాట కారణమే . . .
మరిన్ని విషయాలు రాబోయే కథనాల్లో . .