పద్మావతి అమ్మవారి పంచమి ఉత్సవం
ఈరోజు విశిష్టత . . తిరుచానూరు పద్మావతి అమ్మవారి పంచమి తీర్ధ మహోత్సవం.
తిరుమలలో శ్రీవారికి బ్రహ్మోత్సవాలు జరిగినట్టే ఇక్కడ అమ్మవారికి ఆగమోక్తము గా బ్రహ్మోత్సవాలు జరుగుతాయ్. అందులో కార్తీక బ్రహ్మోత్సవాలు ప్రత్యేకం. కార్తీక బ్రహ్మోత్సవం లో చివరి రోజున జరిగే ఉత్సవం పంచమి తీర్ధం. ఈ ఉత్సవంతో అమ్మవారి ఉత్సవాలు ముగుస్తాయి.
పంచమి తీర్ధ ఉత్సవం నాడు తిరుమల శ్రీవారి ఆలయం నుండి అమ్మవారికి పసుపుకుంకుమ లు సారేలు, చీరెలు, నగలు, నైవేద్యాలు స్వామి వారికి ప్రతినిధులుగా అర్చకులు మేళతాళాలతో మంగళ వాయిద్యాలతో తిరుమల నుండి అలిపిరి కాలిబాటల్లో అత్యంత కన్నుల పండువగా తీసుకువస్తారు. అన్ని బరువుల నెత్తి మీద మోసుకువస్తున్న అర్చకులు ఇసుమంతైనా అలసి పోరు కదా ఉత్సాహం తో ఉరకలు వేస్తుంటారు.
తిరుమల నుండి గజం పైన వేంచేసిన చక్రత్తారు ఆళ్వార్ సహితంగా అమ్మవారికి పద్మ సరోవరంలో చేయించే మంగళ అవభృథ స్నానమే పంచమి తీర్ధం. ఈ ఉత్సవం ద్వారా జనించిన శక్తి ఆ సరోవరం లో మూడు రోజుల పాటు ఉంటుంది. ఆ సమయంలో చేసే స్నానం అద్భుతమైన అమ్మవారి అనుగ్రహము కలుగజేస్తుందని పురాణ వాక్కు. ఈ ఉత్సవం చూసిన , పాల్గొన్నా, విన్నా బహు పుణ్యం .
ఓం నమో వేంకటేశాయ.